కందనవోలు గుంటూరు,

వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జె.ఇ.ఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలు అందించారు. భూమి పూజకు 27వ తేదీ ఉదయం10 నుండి 10.50 గంటల వరకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని చెప్పారు.ముఖ్యమంత్రి కార్యక్రమం పక్కాగా, సజావుగా జరుగుటకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. బహిరంగ సభ వేదిక, బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షణలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని అన్నారు.పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు,జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, డి.ఎస్.పి మురళి కృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాస రెడ్డి,టి.టి.డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శివ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ టి.వి.సత్యనారాయణ, కార్యనిర్వహక ఇంజనీర్ సురేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ కార్యనిర్వహక ఇంజనీర్ లు నాగభూషణం, సత్యవతి, తహసిల్దార్ హరి బాబు తదితరులు పాల్గొన్నారు.

You missed