కందనవోలు కర్నూలు
నిరుపేదల ఆశా కిరణం, భరతమాత ముద్దుబిడ్డ, వీరవనిత ఇందిరాగాంధీ సిటి కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆమె సేవలను కొనియాడారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తెగా, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ భావితరాల కోసం నిస్వార్థ సేవలు అందించి వీర వనితగా అడుగడుగునా కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజా సేవకు తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి ఇందిరాగాంధి మాతృదేశ సేవలో తన ప్రతి రక్తపుబొట్టు తరిస్తుందని చెప్పి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకుల జాతీయీకరణతో రైతులు, చిన్న పరిశ్రమలు, పేదలకు ఎంతో మేలు కలిగించారని రాజ భరణాల రద్దు, ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక, సర్కారియా కమిషన్ ఏర్పాటు, అంటరానితనం నిర్మూలన మొదలగు వాటితో ఎన్నో ప్రయోజనాలు పేదప్రజలకు లభించాయని జిలానీ భాష అభిప్రాయపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎఐసిసి సభ్యులు ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ ఇందిరా గాంధీ పుట్టినరోజు బంగ్లాదేశ్ విమోచన దినంగా జరుపు కుంటున్నామని 1971కి పూర్వం పాకిస్తాన్ సైనికులు పాకిస్థాన్ ప్రజలు, బెంగాలి పౌరులు మహిళలు, విద్యార్థులపై హత్యలు, అత్యాచారాలు చేసి హింసించేవారని పాకిస్థానీయుల అకృత్యాలను భరించలేక బెంగాళీ శరణార్థులు మనదేశంలో తలదాచుకుంటే కోటి మందికి ఆశ్రయం కల్పించిన ఘనత ఇందిరాగాంధీ 1971 సంవత్సరం సైనికచర్య ద్వారా అత్యంత నైపుణ్యంతో చాకచక్యంగా భారత వైమానిక బలగాలు పాక్ సైన్యాన్ని యుద్ధంలో మట్టికరిపించి బంగ్లాదేశీయులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పించిన ఘనత ఇందిరాగాంధీ కే దక్కుతుందని. పరదేశంపై సైనిక చర్య అవసరమా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఇందిరా గాంధీ సమాధానమిస్తూ మాఇంటి ఆడపడుచులే కాదు పక్కింటి ఆడపిల్లలకు అన్యాయం జరిగిన చూస్తూ ఊరుకోనని సమాధానమిచ్చిన వీరవనిత ఇందిరాగాంధీ సుధాకర బాబు ఆమె సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ 108 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రాజవిహార్ సెంటర్ నందలి ఇందిరాగాంధి కాంస్య విగ్రహమునకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు బి క్రాంతి నాయుడు, అనంతరత్నం మాదిగ, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నూర్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పగిడాల అమన్, డాక్టర్ సుభాన్, డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వెంకప్ప, సదానందం, మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు బి హైమావతి ఐ ఎన్ టి యు సి నాయకులు ఆనందం, ఆశీర్వాదం మొదలగువారు పాల్గొన్నారు.
