కందనవోలు శ్రీశైలం
సమయానికి మూలానక్షత్రం రావడంతో లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడుతుంది. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించబడింది.ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడింది.పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించడం జరిగింది.
