కందనవోలు గుంటూరు
మీకోసం వెబ్ సైట్ లో పిజి ఆర్ ఎస్ అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్
కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీల వివరాలు
*Meekosam.ap.gov.in*
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకొనుటకు *1100* (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
