కందనవోలు నంద్యాల
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు జనసేన మొదటి నుంచీ అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు చెల్లిస్తున్నాం. వారికి అన్ని విధాల చేయూత అందిస్తాం. సవాళ్లను అధిగమించి దివ్యాంగులు జీవితంలో విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేశారు.
