కందనవోలు కర్నూలు
డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఆదేశాల మేరకు కర్నూల్ తాలూకా పరిధిలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తాలూకా సిఐ తేజ మూర్తి సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాలూకా సీఐ తేజ మూర్తి హెచ్చరించారు.
