కందనవోలు కర్నూలు

కర్నూలు, రవాణా కమీషనర్ వారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జనవరి 10వ తేదీ శనివారం రాత్రి మరియు ఆదివారం తెల్లవారు జామున డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్. శాంత కుమారి, ఆదేశాలతో ఏఐటివిపి సిసి బస్సు లను తనిఖీ చేయడం జరిగింది. బస్సు కి సంబంధించి అన్ని వాలిడ్ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ మరియు భద్రతా ప్రమాణాలు అనగా ఎమర్జెన్సీ ఎక్స్ఇటూ, ఫైర్ ఎక్స్టింగుషర్స్, సేఫ్టీ హ్యామర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పరిశీలించారు. బస్సులో పేలుడు పదార్థాలు మరియు కమర్షియల్ సామాన్లు తీసుకొని వెళుతున్నారా అని తనిఖి చేశారు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక రద్ది కారణంగా, అధిక టికెట్ ధరలు ప్యాసింజర్ల పై వసూలు చేస్తున్నారా అని తనికి చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన బస్సు ల పై 4 (నాలుగు) కేసు లు రాసి ₹40,000/- జరిమానా విధించారు. ఈ తనఖి లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు యం. వి. సుధాకర్ రెడ్డి, ఎన్. గణేష్ బాబు మరియు సిబంది పాల్గొన్నరు.
