కందనవోలు  కర్నూలు

 

 

కర్నూలు జిల్లా లో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా 37వ మాసోత్సవాలు 2026 సంధర్బంగా 15వ రోజు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారు జామున కర్నూలు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్. శాంత కుమారి, ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ నాగరాజు నాయక్ పర్యవేక్షణలో ఏఐటివిపి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. బస్సు కి సంబంధించి అన్ని వాలిడ్ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ మరియు భద్రతా ప్రమాణాలు అనగా ఎమర్జెన్సీ ఎక్స్ఇటూ, ఫైర్ ఎక్స్టింగుషర్స్, సేఫ్టీ హ్యామర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పరిశీలించారు. బస్సులో పేలుడు పదార్థాలు మరియు కమర్షియల్ సామాన్లు తీసుకొని వెళుతున్నారా అని తనకి చేశారు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక రద్ది కారణంగా, అధిక టికెట్ ధరలు ప్యాసింజర్ల పై వసూలు చేస్తున్నారా అని తనికి చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన బస్సు ల పై కేసు లు రాసి జరిమానా విధించారు. ఈ తనకి లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎస్. నాగరాజ నాయక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, మరియు సిబంది పాల్గొన్నరు

You missed