కందనవోలు శ్రీశైలం
యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, అర్చకస్వాములు, వేదపండితులు, పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు.అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.
