కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.హెలిప్యాడ్, రచ్చబండ వేదిక, పార్కింగ్, తదితర ప్రదేశాలను వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కలియదిరిగి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి ఘటనలకు తావులేకుండా విధులు సమర్ధవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
